భాగవతం లో శ్లోకం


దీనిని చతుః శ్లోకీ భాగవతం అంటారు. పరమాత్మ బ్రహ్మగారికీ, బ్రహమ నారదునికీ, నారదుడు, వ్యాసునికి, వ్యాసుడు శుకునికీ బోధించినది. ఈ నాలుగు శ్లోకాలలో, పరమాత్మ అంటే ఏమిటి, జగత్తు అంటే ఏమిటి,   
శ్రీభగవానువాచ 
జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞానసమన్వితమ్ 
సరహస్యం తదఙ్గంగృహాణ గదితం మయా 
 విజ్ఞ్యానంతో (శాస్త్ర జ్ఞ్యానంతో) కూడిన అతిరహస్యమైన నా తత్వాన్ని చెప్పే జ్ఞ్యానం, రహస్యములతో కూడి ఉన్న (మంత్రములతో కూడి ఉన్న) దానిని నేను ఉపదేశిస్తున్నాను, స్వీకరించు. 

(మంత్రములు మంత్రాంగములు యోగము శాస్త్రము వేదాంగములతో కూడిన దాన్ని చెప్పబోవుతున్నాను అని వ్యాఖ్యానం). ఈ శ్లోకంతో విధురమైత్రేయ, కృష్ణ ఉద్ధవ సంవాదం, ప్రహ్లాద అవధూత సంవాదం, రుద్రహీతలు , మొదలైన సంవాదాలన్నీశ్లోకంతో వస్తుంది. అవి నాలుగున్నరవేల శ్లోకాలు.   
యావానహం యథాభావో యద్రూపగుణకర్మకః 
తథైవ తత్త్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్ 
 అహం యావాన్: నా స్వరూపం ఏమిటీ. నా వ్యాప్తి ఎంతవరకూ ఉందో యధా భావ: నా స్వభావమేమిటో,  

యద్రూపగుణకర్మకః - నేనురూపంలో ఉంటానోగుణములతో ఉంటానోకర్మలు చేస్తానో  (ఈ ఒక్క పాదంతో భాగవతంలో ఉన్న బ్రహ్మ సృష్టి, ప్రజాపతి సృష్టి, ప్రకృతి సృష్టి, ఆత్మ సృష్టి అన్ని వస్తాయి, )  తథైవ తత్త్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్ - నా స్వరూప స్వభావ రూప గుణ కర్మలు అన్నీ ఉన్నదున్నట్లుగా నా అనుగ్రహంతో నీకు కలగాలి.   
అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్సదసత్పరమ్ 
పశ్చాదహం యదేతచ్చ యోऽవశిష్యేత సోऽస్మ్యహమ్ 
 అహమేవాసమేవాగ్రే  - ప్రళయకాలంలో, సృష్టి ప్రారంభం కాకముందు ఉన్నది నేను ఒక్కడినే  

నాన్యద్యత్సదసత్పరమ్- నేను తప్ప సత్, అసత్ , కాలం లేదు. జీవుడు ప్రకృతి పరం ఏవి లేవు. (పరమాత్మ సంకల్పమే కాలం). ప్రళయకాలంలో నాకంటే భిన్నమైనవి ఏమీ లేవు.  

సృష్టికి ముందు నేనే ఉన్నాను, సృష్టి కాలంలోనూ నేనే ఉన్నాను, సృష్టి లయం అయ్యాక కూడా (పశ్చాదహం ) నేనే ఉన్నాను.  

యోऽవశిష్యేత సోऽస్మ్యహమ్ - ఏది మిగులుతుందో అదే నేను   (ఈ శ్లోకం వలన భాగవతంలో ఉన్న అన్ని రకాల సృష్టి రక్షణ ప్రళయములూ చెప్పబడ్డాయి)  
ఋతేऽర్థం యత్ప్రతీయేతప్రతీయేత చాత్మని 
తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథా తమః 
 ఋతేऽర్థం యత్ప్రతీయేత - నా సంకల్పం మేరకే అన్నీ జరుగుతాయి  నేను ఉన్నాను కాబట్టే ఇవన్నీ కనపడుతున్నాయి. నేను లేకపోతే నీకు నీవే కనపడవు. (మనలని "మనం" అని మనం అనుకోవడానికి కూడా మనలో ఆయన ఉంటేనే అనుకోగలము. మనకు ఏమైన విషయం తెలిసిందీ అంటే తెలియబడిన విషయంలోనూ, తెలుసుకున్నవాడిలోనూ, తెలుసుకోవడంలోనూ, జ్ఞ్యాతా జ్ఞ్యేయమూ జ్ఞ్యానముమూడింటిలోనూ ఆయన ఉన్నప్పుడేజ్ఞ్యానం కలుగుతుంది. అనుభూతి మనకి కలుగ్తోంది అంటే అది పరమాత్మ కలిగించిందే. ఏ జ్ఞ్యానమైనా అతని సంబంధంతోటే కలుగుతుంది ) 

ప్రతీయేత చాత్మని - నేను లేకుంటే ఆత్మలో ఎలాంటి స్వరూప స్వభావ జ్ఞ్యానములు కలగవు తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథా తమః 

తెలిసినదీ అన్నా, తెలియందీ అన్నా, ఈ రెండూ నా మాయే. వెలుతురూ చీకటి లాగ ప్రకృతి సంబంధం ఉంటే నా జ్ఞ్యానం ఉండదు. నా జ్ఞ్యానం ఉంటే వాడు ప్రకృతితో మోహింపబడడు. ఐతేఆత్మజ్ఞ్యానమైనా ప్రకృతి జ్ఞ్యానమైనా నా సంకల్పంతోనే కలుగుతాయి.   
యథా మహాన్తి భూతాని భూతేషూచ్చావచేష్వను 
ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషుతేష్వహమ్ 
 సకల జగత్తులో పరమాత్మ అంతర్యామిగా ఉంటున్నాడు. (కుండ పగలగొట్టినా అందులో ఉండే ఆకాశం అలాగే ఉంటుంది ఎందుకంటే కుండ కూడా ఆకాశంలో ఉంటుంది. అయినా మనం కుండలో ఆకాశం ఉంది అంటాం. మరి కుండ విరిగితే ఆకాశం ఎక్కడికీ పోకుండా అలాగే ఉంటుంది. ) 

ప్రతీ ప్రాణిలోనూ (చిన్న ప్రాణిలోనూ పెద్ద ప్రాణిలోనూ) పంచభూతాలు ఉన్నాయి. పంచభూతములతోనే మనం ఏర్పడ్డాము. మనమే పంచభూతములలోకి వెళ్ళాము. పంచభూతములు ప్రవేశించినట్లూ ఉంటాయి, ప్రవేశించనట్లూ ఉంటాయి. మనలో అన్ని రంధ్రములలో ఆకాశం ఉంది, ద్రవమంతా జలం, వేడి అంతా అగ్ని, ఘనమైన శరీరమంతా భూమి, శరీరమంతా వాయువూ, ఇలా అన్ని భూతాలు మనలో ఉన్నాయి. పంచభూతాలు మనలో ప్రవేశించినట్లు అనిపిస్తుంది, అలాగే వెళ్ళిపోయినట్లు కనపడతాయి. అలా పంచభూతాలు వచ్చి వెళ్ళినట్లు అనిపిస్తాయి. 

నేనుపంచభూతాలలో ఉంటాను. కనీ అవి నాకు అంటవు. పాప పుణ్యాలు, న్యాయాన్యాలు, హితాహితాలు అన్నీ ప్రకృతి సంబంధాలు. ప్రకృతికి సంబంధించినదోషాలూ నాకు అంటవు. నేను అన్నింటిలోనూ ఉంటాను. నాకేదీ అంటదు. అన్నిట్లో ఉన్నట్లే ఉంటాను, ఎందులోనూ ఉండను. వేటిలో లేను అనుకుంటారు, గానీ అన్నిటిలో నేను ఉంటాను  (దీనితో మొత్తం భక్తుల చరిత్రలు వస్తాయి)  
ఏతావదేవ జిజ్ఞాస్యం తత్త్వజిజ్ఞాసునాత్మనః 
అన్వయవ్యతిరేకాభ్యాం యత్స్యాత్సర్వత్ర సర్వదా 
 ప్రతీ వ్యక్తీ ప్రపంచములో తెలుసుకోవలసినది ఇదే. ఆత్మ తత్వం తెలుసుకోవాలి అనుకునే వాడు తెలుసుకోవలసిన విషయం ఇదే. అన్వయవ్యతిరేకాభ్యాం  - ఏది తెలిస్తే మనకు విషయం తెలుస్తుందో అది అన్వయం. ఏది లేకపోతే మనకి విషయం తెలియదో అది వ్యతిరేక్వ్యాప్తి (వ్యతిరేకం కారణం నుంచి వస్తుంది. ఉదా: "జ్య్నానం లేకుంటే పరమాత్మ తెలియబడదు"). ఏ జ్ఞ్యానంతో పరమాత్మ తెలుస్తాడొ, ఏ అజ్ఞ్యానంతో పరమాత్మ ప్రచ్చనంగా ఉంటాడో , ఇలాంటి రెంటితోటీ. పరమాత్మ అన్ని వేళలా, అన్ని రూపాలలో, అన్ని సంకల్పాలలో ఉన్నాడు.   
ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధినా 
భవాన్కల్పవికల్పేషువిముహ్యతి కర్హిచిత్ 
 మీరు ఇంక తపస్సు చేయాండి. కానీసూత్రాన్ని మర్చిపోవద్దు. ఈ విజ్ఞ్యానాన్ని నీవు మనసులో పెట్టుకుంటే ఎన్ని వికల్పములు వచ్చినా నీవు మోహింపబడవు, నా మాయ నిన్ను ఏమీ చెయ్యదు