వినాయక పూజలో ఉన్న విశిష్టతల విశేషాలు
ఏకవింశతి పత్ర పూజ ఏకవింశతి
అంటే 21 రకాలు. వీటి వివరాలు - అవి
ఆరోగ్యానికి ఉపయోగపడే విధానం:
1.బృహతి పత్రం (వాకుడు ఆకు)
:- ఇది ఉబ్బసాన్ని తగ్గిస్తుంది
2.మాచి పత్రం (మాచి ఆకు ):-
ఒతిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.
3.బిల్వపత్రం (మారేడు ఆకు) :-
మధు మేహం,విరేచనాలకు విరుగుడుగా పని
చేస్తుంది.
4.దూర్వ పత్రం (గరికె గడ్డి)
:- రోగ నిరోధకంగా పని చేస్తుంది.
5.దత్తుర పత్రం (ఉమ్మేత):-
ఊపిరితితులను వ్యకోచిమ్పచేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది.
6.బదరి పత్రం (రేగు ఆకు):-
చర్మ వ్యాధులకు మంచి విరుగుడు.
7.తుర్యా
పత్రం(తులసి):-శరీరంలో ఉష్ణాన్ని నియమ్త్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి
చెట్టు ఉండాలి. ఆ గాలికి జలుబు,దగ్గు వంటివి దరి చేరవు.
8.అపామార్గ పత్రం(ఉత్తరేణి):
-దగ్గు ,ఉబ్బసంకి బాగా పని
చేస్తుంది.
9.చూత పత్రం(మామిడి
ఆకు):-నోటి దుర్వాసన,చిగుళ్ళ వాపు వంటి సమస్యల
నుంచి ఉపసమనం ఇస్తుంది.
10.జాజి పత్రం(జాజి ఆకు):-
చర్మ రోగాలు,స్త్రీ సంభంద వ్యాధులకు
మంచిది.
11.గండకి పత్రం(అడవి మొల్ల
యుధిక):- అతిమూత్ర సమస్యనుంచి ఉపసమనం ఇస్తుంది.
12.అశ్వత పత్రం(రావి ఆకు):-చాల
ఓషధగుణాలు ఉన్నాయి.
13.అర్జున పత్రం(మద్ది
ఆకు):-రక్త స్తంభనం,గుండె ఆరోగ్యానికి ఇది చాల
సహాయకారి.
14.అర్క పత్రం(జిల్లేడు ఆకు)
:-నరాల బలహీనత ఉన్నవరికిది దివ్య ఒషధం.చర్మ వ్యాధులను నివారిస్తుంది.
15.విష్ణు క్రాంతం(పొద్దు
తిరుగుడు ఆకు):-దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్న దేమిటంటే ఇది మంచి స్కిన్
కేర్ మందుగా పనిచేస్తుంది.
16.దాడిమ పత్రం(దానిమ్మ ఆకు):-
వాంతులు,విరేచనాలు,అరికడుతుంది.శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం
చేస్తుంది.
17.దేవదారు(దేవదారు ఆకు):-శరీర
వేడిని తగ్గిస్తుంది.
18.మరువాకం(మరువం ఆకు):-మానసిక
ఒత్తిడిని తగ్గిస్తుంది.
19.సింధువార
పత్రం(వావిలాకు):-కీల్లనోప్పులకు మంచి మందు.
20.శమీ పత్రం(జామ్మీ
చెట్టు):-నోటి వ్యాధులను తగ్గిస్తుంది.
21.కరవీర పత్రం(గన్నేరు
ఆకు):-గడ్డలు, పుండ్లు తగ్గటానికి దీని
వేరు,బెరడు వాడతారు.